Andhra Pradesh: ఏపీలో తీవ్రస్థాయిలో విస్తరిస్తున్న కరోనా... కొత్తగా 845 మందికి పాజిటివ్

Andhra Pradesh sees more corona positive cases
  • గత 24 గంటల్లో ఐదుగురి మృతి
  • 198కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
  • తాజాగా 281 మంది డిశ్చార్జి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో గుర్తించగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 4 కేసులు వెల్లడయ్యాయి.

దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,097కి చేరింది. తాజాగా 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 7,313 మంది డిశ్చార్జి కాగా, 6,673 మంది ఆసుపత్రులలో, 1,913 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 198కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News