TikTok: నిషేధంపై స్పందించిన టిక్ టాక్ ఇండియా యాజమాన్యం!

  • నిబంధనలన్నీ పాటిస్తున్నాం
  • చైనా సహా ఏ ప్రభుత్వానికీ సమాచారం ఇవ్వలేదు
  • టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ
Tiktok India Head Comment on Ban

టిక్ టాక్ తో పాటు మరో 58 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో టిక్ టాక్ ఇండియా స్పందించింది. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేసింది. "భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు.

More Telugu News