Tamilnadu: పెద్దలను ఎదిరించి హిజ్రాతో సహజీవనం.. ఉరేసుకుని ఇద్దరూ ఆత్మహత్య

  • తమిళనాడులో ఘటన
  • ఆరు నెలల క్రితం హిజ్రాతో పరిచయం
  • నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి కాపురం
man and hijra suicided in tamilnadu

పెద్దలను ఎదిరించి సహజీవనం చేస్తున్న ఓ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులో జరిగిందీ ఘటన. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్ (26)కు, నిరావీకి చెందిన శివానీ (30) అనే హిజ్రాతో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.

విషయం తెలిసిన దిలీప్ తల్లిదండ్రులు మందలించారు. అయినప్పటికీ పట్టించుకోని దిలీప్.. శివానీని మర్చిపోలేనని తెగేసి చెప్పాడు. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో శివానీతో కలిసి కాపురం పెట్టాడు. ఆ తర్వాత ఏమైందో కానీ నిన్న ఇద్దరూ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News