Terrorists: జమ్మూకశ్మీర్‌లో 8 మంది ఉగ్రవాదుల హతం

  • షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో ఘటన
  • 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌
  • పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులు
  • రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ జవాన్ల కాల్పులు
8 Terrorists Killed In  Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు మరో ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను విజయవంతంగా వినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్‌లో మొత్తం ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.

మరోవైపు, ఈ రోజు ఉదయం 10.45 నుంచి పాకిస్థాన్‌ రేంజర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతుండడంతో వారి దాడిని భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ జవాన్లు కాల్పులకు పాల్పడుతున్నారు.

More Telugu News