10 మంది భారత జవాన్లను విడిచిపెట్టిన చైనా

China releases 10 Indian soldiers
  • భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు 
  • లడఖ్‌లో ఇటీవల ఘర్షణ
  • భారత సైనికులను అదుపులోకి తీసుకున్న చైనా
  • మొత్తం 76 మంది భారత సైనికులకు గాయాలు
తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా అదుపులోకి తీసుకున్న 10 మంది భారత సైనికులను ఆ దేశం విడిచిపెట్టింది.

ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత సైనికులను చైనా విడుదల చేసింది. వారిలో ఓ లెఫ్టినెంట్‌ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన ఘర్షణలో మొత్తం 76 మంది భారత సైనికులు గాయాలపాలైనట్లు తెలిసింది. వారిలో చాలా మంది ఇప్పటికే కోలుకున్నారు.
Go Back to Shorts
China
India
army

More Telugu News