Andhra Pradesh: నవ శకానికి నాంది... దేశంలోనే తొలిసారిగా ఏపీ అసెంబ్లీ రికార్డు!

  • ఆన్ లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగం
  • మిగతా రాష్ట్రాలు అనుసరించనున్నాయి
  • తన ప్రసంగంలో వ్యాఖ్యానించిన గవర్నర్
New Record in Andhra Pradesh Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నేడు ఓ కొత్త పోకడకు నాంది పలికింది. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి, ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని, అసెంబ్లీకి వెళ్లవద్దని అధికారులు సూచించడంతో, రాజ్ భవన్ నుంచే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇండియాలో ఓ గవర్నర్ ఇలా ఆన్ లైన్ మాధ్యమంగా అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి.

ఇక గవర్నర్ తన ప్రసంగంలో తన ప్రభుత్వం ఓ నవ శకానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీని మిగతా రాష్ట్రాలు అనుసరించనున్నాయని అంచనా వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ, ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకూ దగ్గరైందని తెలిపారు. కాగా, గవర్నర్ ప్రసంగం తరువాత, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచనున్నారు.

More Telugu News