Viral Videos: పింఛను కోసం.. తల్లిని మంచంపై పడుకోబెట్టి బ్యాంకు వరకు లాక్కెళ్లిన కూతురు.. వీడియో ఇదిగో

  • ఒడిశాలోని నౌపాడా జిల్లాలో ఘటన
  • తల్లిని కూడా తీసుకురావాలన్న బ్యాంకు సిబ్బంది
  • చేసేది లేక మంచంపై తీసుకెళ్లిన కూతురు
a woman was seen dragging her centenarian mother on a cot

తన తల్లిని మంచంపై పడుకోబెట్టి ఓ మహిళ బ్యాంకు వరకు లాక్కెళ్లాల్సి వచ్చిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. నౌపాడా జిల్లాకు చెందిన ఆ మహిళ తల్లికి సంబంధించిన పింఛను డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లగా, నిబంధనల ప్రకారం ఆమెను తీసుకొస్తేనే డబ్బు ఇస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీంతో తన వద్ద ఏ వాహనం లేకపోవడంతో తన తల్లి (100)ని మంచంపైనే పడుకోబెట్టి ఆమె బ్యాంకు వరకు లాక్కెళ్లింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీనిపై స్పందించిన నౌపాడా ఎమ్మెల్యే రాజు ధోలాకియా ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ... 'ఈ విషయం మా దృష్టికి వచ్చింది. తన తల్లి పింఛను డబ్బుల కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అన్నారు.

More Telugu News