Corona Virus: దేశంలో కొత్తగా 11,929 కరోనా కేసులు నమోదు

  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,20,922
  • మృతుల సంఖ్య మొత్తం 9,195
  • 1,49,348  మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 1,62,379 మంది  
311 deaths and highest single day spike of 11929 new COVID19 cases reported in the last 24 hours

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,929 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 311 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,195కి పెరిగింది. 1,49,348  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు.

More Telugu News