Pawan Kalyan: మా ఇద్దరి మధ్య సైగలు ఉంటాయి.. అవి పవన్‌కు మాత్రమే అర్థమవుతాయి: హాస్యనటుడు అలీ

  • అందుకే నన్ను చూడగానే పవన్ కల్యాణ్‌ బాగా నవ్వుతారు
  • ప్రతి ఏడాది చిరంజీవి ఆవకాయ పంపిస్తారు
  • పవన్ ‌కల్యాణ్‌ కూడా ఆర్గానిక్ ‌మామిడి పండ్లు పంపేవారు
  • రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సారి పంపలేదు
ali about pawan

తనని చూడగానే సినీనటుడు పవన్ కల్యాణ్‌ బాగా నవ్వుతారని, అలా ఎందుకు చేస్తారని కొందరు అభిమానులు తనను అడుగుతుంటారని హాస్యనటుడు అలీ చెప్పారు.
తమ ఇద్దరి మధ్య కొన్ని సైగలు ఉంటాయని, అవి పవన్‌కు మాత్రమే అర్థమవుతాయని ఆయన చెప్పారు. అందుకే పవన్ కల్యాణ్‌ అలా నవ్వుతారని ఆయన వివరించారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు ముచ్చటించారు. తాను చాలా ఏళ్లుగా చిరంజీవి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని చెప్పారు. ప్రతి ఏడాది చిరంజీవి ఆవకాయ పంపిస్తారని, అలాగే పవన్ ‌కల్యాణ్‌ కూడా ఆర్గానిక్ ‌మామిడి పళ్లు పంపేవారని తెలిపారు. అయితే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తనకు మామిడి పండ్లను పంపలేదని, మరి వచ్చే ఏడాదయినా పంపుతారేమో చూడాలని ఆయన చెప్పారు. చిరంజీవి కుటుంబానికి తనంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు.

More Telugu News