ఏపీలో కరెంటు బిల్లును ముట్టుకున్నా షాక్ కొడుతోంది!: సీఎం రమేశ్
- ఏపీలో విద్యుత్ చార్జీలపై వివాదం
- టారిఫ్ పెంచారంటూ ప్రభుత్వంపై విమర్శలు
- నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీఎం రమేశ్ డిమాండ్
ప్రజలకు షాక్ కొట్టే రీతిలో విద్యుత్ టారిఫ్ పెంచారని, విద్యుత్ శ్లాబ్ ను 75 యూనిట్లకు తగ్గించారని ఆరోపించారు. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయంపై నిరసనలకు బీజేపీ ఏపీ విభాగం పిలుపునిచ్చిందని, ఈ మేరకు తాను నిరసన దీక్ష చేపట్టానని సీఎం రమేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సామాన్య ప్రజలపై భారం మోపే ఇలాంటి నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.