Jagan: ఆత్మబంధువైన అన్నదాతకు నమస్కరిస్తూ ..: 'రైతు భరోసా' జమ సందర్భంగా అన్నదాతలకు సీఎం జగన్ లేఖ

  • ‘రైతు భరోసా’ కింద వరుసగా రెండో ఏడాది రైతులకు డబ్బు
  • ఈ సందర్భంగా రైతులకు జగన్  లేఖ  
  • రైతు సంతోషమే రాష్ట్రం సంతోషమని నమ్మామన్న జగన్
AP CM Jagan writes a letter

ఏపీలో ‘రైతు భరోసా’ కింద వరుసగా రెండో ఏడాది రైతుల ఖాతాల్లో డబ్బులు రేపు జమ చేస్తున్న సందర్భంగా అన్నదాతలకు ఏపీ సీఎం జగన్ ఓ లేఖ రాశారు. ‘ఆత్మబంధువైన అన్నదాతకు నమస్కర్కిస్తూ మీ జగన్ రాస్తున్న ఉత్తరం..’ అంటూ ఆ లేఖను ప్రారంభించారు.

రైతు సంతోషమే రాష్ట్రం సంతోషమని నమ్మి, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం గత ఏడాది దసరా వేళ ప్రారంభించిందని అన్నారు. ఏటా ఖరీఫ్ కు ముందే, మే నెలలోనే ‘రైతు భరోసా’ సొమ్మును అందిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ, రాష్ట్రంలో దాదాపు 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద వరుసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు.

‘రైతు భరోసా’ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఈ నెల 30న గ్రామ సచివాలయాల్లో ‘రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, నాణ్యత ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇందులో లభిస్తాయని అన్నారు. ఈ కేంద్రాల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి విధివిధానాలు కూడా రూపొందిస్తున్నట్లు ఆ లేఖలో జగన్ తెలిపారు.

More Telugu News