Mahesh Babu: కృష్ణ పుట్టినరోజున మహేశ్ బాబు ఫస్టులుక్

  • మహేశ్ బాబు నుంచి 27వ సినిమా
  • 'గీత గోవిందం' తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  
Parashuram Movie

మహేశ్ బాబు తన 27వ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పరిణతితో కూడిన ప్రేమకథగా ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31)న ఈ సినిమాను లాంచ్ చేయాలని భావించారు.

అయితే ఆ రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయడమే కాకుండా, మహేశ్ బాబు ఫస్టులుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారనేది తాజా  సమాచారం.  ఈ సినిమాలో కథానాయిక అంటూ ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ కథానాయికల్లో ఒకరిని త్వరలోనే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.  'గీత గోవిందం'తో  హిట్ కొట్టిన పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో, మహేశ్ బాబుకి మరో భారీ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News