E-Commerce: గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ అమ్మకాలకు పచ్చ జెండా

  • మే 17 వరకు కొత్త లాక్ డౌన్
  • రెడ్ జోన్ మినహా మిగతా జోన్లలో కార్యకలాపాలకు అనుమతి
  • ఈ-కామర్స్ సైట్లలో అన్ని వస్తువుల విక్రయాలకు కేంద్రం ఆమోదం
  • బార్బర్ షాపులకు గ్రీన్ సిగ్నల్
Centre gives nod for e commerce portals in green and orange zones

దేశంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో, కేంద్రం మే 4 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ప్రకటించింది.

ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులు విక్రయించుకోవచ్చని తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా కేవలం నిత్యావసరాలనే అనుమతించారు. తమకు అన్ని రకాల వస్తువులు విక్రయించే వెసులుబాటు కల్పించాలని పలు ఈ-కామర్స్ సైట్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడిందని భావిస్తున్నారు. ఇక, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బార్బర్ షాపులకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది.

More Telugu News