kutbullapur: కుత్బుల్లాపూర్ పరిధిలో 3 కంటైన్ మెంట్ జోన్లు ఎత్తివేత

  • కంటైన్ మెంట్ ఫ్రీ జోన్లుగా అపురూప కాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్ నగర్  
  • ఈ మూడు ప్రాంతాల్లో 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు  నమోదు కాలేదు
  • సీఎస్ ఆదేశాల మేరకు ఆయా చోట్ల కంటైన్ మెంట్ ఎత్తివేత

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని 3 కంటైన్ మెంట్ జోన్లు ఎత్తివేశారు. అపురూప కాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్ నగర్ లో కంటైన్ మెంట్ ను ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మూడు ప్రాంతాల్లో 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు కంటైన్ మెంట్ ఎత్తివేశారు. కంటైన్ మెంట్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More Telugu News