ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చిన హీరో రాజశేఖర్‌ కూతుళ్లు

ActorRajasekhar s Daughters  Contributes Rs 2 Lakhs for Telangana CM Relief fund
  • కేటీఆర్‌ను కలిసిన శివాని, శివాత్మిక‌ 
  • సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 లక్షలు విరాళం
  • అభినందించిన కేటీఆర్
సినీనటుడు రాజశేఖర్‌ కూతుళ్లు శివాని, శివాత్మిక‌ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. కరోనా విజృంభణ సమయంలో మరోసారి సాయం ప్రకటించారు. ఇటీవలే శివాని, శివాత్మిక‌లు ఒక్కొక్క‌రు రూ.1ల‌క్ష చొప్పున ‘కరోనా క్రైసిస్ ఛారిటీ' కి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఈ రోజు వారిద్దరు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు.
                                               
                                       
Go Back to Shorts
Rajasekhar
Tollywood
KTR
Lockdown

More Telugu News