Kanna Lakshminarayana: అన్నవరం కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు తగదు: ఏపీ సీఎస్ కు కన్నా లేఖ

  • ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లా?
  • హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు వద్దు
  • ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కోరిన కన్నా
AP BJP Leader Kanna writes a letter to CS Sahni

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై ఉన్న హరిహర సదన్ లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు చేయాలని అధికారులు లేఖ రాయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఓ లేఖ రాశారు. ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో కోరారు. అన్నవరం కొండ ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందేనని, అక్కడ కల్పించిన వసతులన్నీ హిందువుల కోసం చేసినవేనని గుర్తుచేశారు. ఈ కొండపై నిర్మించిన సత్రాలన్నీ దాతలు, భక్తుల సహకారంతో చేపట్టినవేనని చెప్పారు.

More Telugu News