Arvind Kejriwal: ‘కరోనా’ సోకిన వారికి ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేస్తాం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించాయి
  • మూడు నాలుగు రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స
  • ఇది విజయవంతమైతే ‘కరోనా’ బారినపడ్డ వాళ్ల ప్రాణాలు కాపాడొచ్చు
Aravind Kejriwal Statement

కరోనా వైరస్ బారిన పడ్డ వారి ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్లాస్మా చికిత్సను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం కేజ్రీవాల్  ఓ ప్రకటన చేశారు. మూడు నాలుగు రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా లభించాయని చెప్పారు. ఈ చికిత్సా విధానం విజయవంతమైతే కనుక తీవ్ర స్థాయిలో  ‘కరోనా’ బారిన పడ్డ వారిని కాపాడుకోవచ్చని చెప్పారు.

ఢిల్లీలో ఇప్పటి వరకూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 1,578 మంది కాగా, 42 మంది కోలుకున్నారని, 32 మంది మృతి చెందారని అన్నారు. ఈ నెల మొదటి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రులలో చేరిన వ్యక్తులు కోలుకుంటున్నారని, రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జి అవుతారని తెలిపారు.

More Telugu News