Chandrababu: తమిళనాడు సీఎంకు, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖ

  • తమిళనాడులో చిక్కుకుపోయిన ఆంధ్రా వలస కార్మికులు
  • కార్మికుల యోగ క్షేమాలపై వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి
  • వారికి నిత్యావసరాలు అందించాలని చంద్రబాబు వినతి
Chandrababu Naidu writes a letter to CM Palani swamy and central Home secretary

తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. తమిళనాడులో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు చెందిన 1500 మంది  భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి  చేశారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన కారణంగా భనవ నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు అందించాలని కోరారు. అక్కడ చిక్కుకుపోయిన కార్మికుల యోగ క్షేమాల గురించి వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని ఆ లేఖ ద్వారా వారి దృష్టికి తెచ్చారు. ఆయా కార్మికులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలను ఆ లేఖలో జతపరిచారు.

  • Loading...

More Telugu News