Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్య

  • డెంటల్ కాలేజ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం
  • ఘటనా స్థలంలో పాప మృతదేహం లభ్యం
  • మృతులు ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Two women commits suicide in Hyderabad

 తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఇద్దరు యువతులు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో పాప మృతదేహం కూడా ఉండటం కలచివేస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతులు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు.

More Telugu News