Tamil Nadu: చికిత్స చేస్తున్న వైద్యుడిపై ఉమ్మిన కరోనా రోగి.. హత్యాయత్నం కేసు నమోదు

  • తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఘటన
  • కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 40 ఏళ్ల రోగి
  • చికిత్సకు సహకరించకుండా వేధింపులు
Coronavirus patient booked for spitting on doctor

తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే ఓ రోగి ఉమ్మివేశాడు.

కరోనా లక్షణాలతో 40 ఏళ్ల వ్యక్తి ఒకరు తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అతడు చేరినప్పటి నుంచి చికిత్సకు సహకరించకపోగా, ముఖానికున్న మాస్కును తొలగించి వైద్యులపై విసురుతూ వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా, తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. వైద్యుల ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News