Maanvi Gagroo: ఒక నిర్మాత నన్ను 'కాంప్రమైజ్' కావాలని అడిగాడు.. మండిపోయింది!: నటి మాన్వి గ్యాగ్రో

  • 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్ క్రేజ్ తెచ్చింది 
  •  సెకండ్ పార్ట్ ఏప్రిల్ 17 నుంచి మొదలవుతుంది 
  • కాంప్రమైజ్ మాట వినగానే ఒళ్లు మండిపోయిందన్న మాన్వి
Maanvi Gagroo

బాలీవుడ్ నటి మాన్వి గ్యాగ్రో పేరు వినగానే అమెజాన్ ప్రైమ్ లో ఆమె చేసిన 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' అనే వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. అంతగా ఆమెకు ఆ వెబ్ సిరీస్ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్ ఏప్రిల్ 17 నుంచి మొదలవుతుంది. యూత్ లో మంచి క్రేజ్ వున్న ఆమె, తను లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆమె మాట్లాడుతూ .. " ఏడాది క్రితం ఒక అపరిచిత నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతల వ్యక్తి మాట్లాడుతూ .. 'నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను .. అందులో నువ్వు నటించాలి' అంటూ పారితోషికం ఎంతో కూడా చెప్పాడు. 'ఈ పారితోషికం చాలా తక్కువ. అయినా స్క్రిప్ట్ గురించి చెప్పండి .. నాకు నచ్చితే చేస్తాను .. లేకపోతే లేదు' అన్నాను.

ఆ వెంటనే ఆయన నాకు ఇస్తానన్న పారితోషికాన్ని మూడింతలు పెంచేశాడు. అంతేకాదు, ఎంత కావాలంటే అంత ఇస్తాను .. కానీ 'కాంప్రమైజ్' కావాలని అడిగాడు. నేను ఫీల్డ్ కి వచ్చిన ఏడెనిమిది ఏళ్లకి 'కాంప్రమైజ్' అనే మాట విన్నాను. ఆయన మాటల్లోని ఆంతర్యం నాకు అర్థం కావడంతో కోపంతో రగిలిపోయాను. 'ఎంత ధైర్యం రా నీకు .. నీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను' అంటూ కాల్ కట్ చేశాను అని చెప్పుకొచ్చింది.

More Telugu News