Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రకుల్ అలా నిర్ణయించుకుంది! 
  • శేఖర్ కమ్ములతో రానా ప్రాజక్ట్ 
  • 'కార్తికేయ 2'పై దర్శకుడి అప్ డేట్ 
Rakul Preeth Singh donates her earnings through youtube to PM CARES FUND

 *  ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన యూ ట్యూబ్ చానెల్ లో మళ్లీ వీడియోలు పోస్ట్ చేయనుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం కరోనా సహాయక చర్యల నిమిత్తం పీఎం కేర్స్ ఫండ్ కి పంపిస్తుందట.
*  రానా దగ్గుబాటిని గతంలో 'లీడర్' చిత్రం ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల వెండితెరకు పరిచయం చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానుంది. ప్రస్తుతం తాను చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రం తర్వాత శేఖర్ తన తదుపరి చిత్రాన్ని రానాతో చేస్తాడని సమాచారం.
*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. అయితే, గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి ఇది సీక్వెల్ మాత్రం కాదని దర్శకుడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 'ఆ చిత్రానికీ, ఈ చిత్రానికి అసలు సంబంధం లేదు. కేవలం టైటిల్ మాత్రమే తీసుకున్నాం. దేశంలోని వివిధ స్వయంభూ దేవాలయాల శిల్పకళకు సంబంధించిన కథతో ఇది సాగుతుంది' అని చెప్పాడు దర్శకుడు.

More Telugu News