Corona Virus: దేశంలో మరింత పెరిగిన కరోనా కేసులు.. మరణాలు

  • 12 గంటల్లో 302 కొత్త కేసులు 
  • పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,374
  • 77 మంది మృతి  
  • మహారాష్ట్రలో 490 మందికి కరోనా
coronavirus cases in india

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 12 గంటల్లో 302 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. దీంతో దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,374కు చేరిందని తెలిపింది. వారిలో 3,030 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది.

ఇప్పటివరకు దేశంలో 267 మంది కోలుకున్నారని తెలిపింది. 77 మంది మృతి చెందారని వివరించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 490 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత తమిళనాడులో 485 మంది ఉన్నారు.

ఏయే రాష్ట్రంలో ఎంతమంది కరోనా బాధితులు..     
                   
 

More Telugu News