Italy: ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం!

  • ఇటలీలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా
  • నిన్న ఒక్క రోజే 627 మరణాలు నమోదు
  • కరోనా మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ
627 Italians dead in a single day due to Corona virus

ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏకంగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,032కి చేరుకుంది. ఈ వివరాలను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు, కరోనా మరణాల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు ఆ దేశానికి పెను సవాల్ గా నిలిచింది. పరిస్థితి పూర్తిగా చేజారి పోవడంతో... ఆ దేశ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి జారిపోయింది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

More Telugu News