Rajya Sabha: సరికొత్త రూ.250 నాణెం.. రాజ్యసభలో విడుదల!
రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిజర్వు బ్యాంకు రూ.250 విలువైన సరికొత్త నాణాన్ని విడుదల చేసింది. పది గ్రాముల వెండితో ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. ముందువైపు సారనాథ్ సింహాల చిత్రం, కాయిన్ విలువను ముద్రించగా.. వెనుకవైపు రాజ్యసభ 250 సెషన్, గాంధీ బొమ్మను, 250 చుక్కలను ముద్రించారు. దానిని గురువారం రాజ్యసభలో సభ్యులకు పంపిణీ చేశారు.