Nara Lokesh: జప్ఫా బ్యాచ్ కి నా సానుభూతి తెలియజేస్తున్నా: నారా లోకేశ్​

  • మార్ఫింగ్ కు గురైన లోకేశ్ ట్వీట్ 
  • వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంతకైనా దిగజారుతుంది
  • మార్ఫింగ్ ట్వీట్స్ తో సంబరపబుతున్నారా?
Nara Lokesh lashes out Jagan

మార్ఫింగ్ ట్వీట్స్ చేస్తున్న ‘జప్ఫా’ బ్యాచ్ కి తన సానుభూతి తెలియజేస్తున్నానని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. లోకేశ్ పేరిట వచ్చిన ఓ ఫేక్ ట్వీట్ ను ఉద్దేశించి ఆయన స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ విసిరే ఐదు రూపాయల కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంతకైనా దిగజారుతుందని ధ్వజమెత్తారు.

వైసీపీ రాక్షస పాలనకు మాచర్ల ఘటన పరాకాష్ఠ అని, రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందంటూ.. లోకేశ్ చేసిన ఓ ట్వీట్ ను మార్ఫింగ్ చేశారు. ‘కారుతో పిల్లోడిని గుద్దేసి వెళ్లడం మా నాయకులు చేసిన తప్పే..’ అని మార్ఫింగ్ చేసిన ట్వీట్ లో ఉంది. ‘రియల్, ఫేక్’ అంటూ ఆ రెండు ట్వీట్లను పోల్చిచూపిస్తూ లోకేశ్ ఈ పోస్ట్ చేశారు.

More Telugu News