Nara Lokesh: టీడీపీ అభిమాని రామకృష్ణన్ మృతి బాధాకరం: నారా లోకేశ్

  • ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించే వ్యక్తి రామకృష్ణన్
  • ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి 
  • పార్టీ కార్యకర్తలందరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి
 Nara Lokesh expresses grief over death of TDP Fan Ramakrishnan

టీడీపీ అభిమాని రామకృష్ణన్ మృతి చెందడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తూ ఉండే రామకృష్ణన్ గుండెపోటుతో మరణించడం బాధాకరమైన విషయమని అన్నారు. రామకృష్ణన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. పార్టీ కార్యకర్తలందరూ తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More Telugu News