విద్యార్థులు కొత్తగా వచ్చిన పౌరసత్వ చట్టాన్ని ఓసారి చదవాలి: అమిత్ షా
- పౌరసత్వ చట్టానికి సవరణ చేసిన కేంద్రం
- దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు
- స్పందించిన అమిత్ షా
విద్యార్థులు సవరించిన పౌరసత్వ చట్టాన్ని ఓసారి చదవాలని సూచించారు. అందులోని అంశాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారాలు చేస్తుంటాయని, వాటి ఉచ్చులో విద్యార్థులు చిక్కుకోరాదని హితవు పలికారు. ఝార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.