నాకు రాజకీయాలు అవసరం లేదంటూ మరోసారి కంటతడి పెట్టిన కుమారస్వామి
- జేడీఎస్ సమావేశంలో భావోద్వేగానికి గురైన కుమారస్వామి
- తన కుమారుడి ఓటమిపై కంటతడి
- నారాయణగౌడ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
తనకు రాజకీయాలు, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని కుమారస్వామి అన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు మాత్రమే తనకు కావాలని చెప్పారు. తనకు కుమారుడు ఎందుకు ఓడిపోయాడో తనకు అర్థం కావడం లేదని... మండ్య నుంచి నిఖిల్ పోటీ చేయాలని తాను భావించలేదని... మండ్య ప్రజలే నిఖిల్ పోటీ చేయాలని కోరారని... కానీ, చివరకు నిఖిల్ కు వారే సపోర్ట్ చేయలేదని... ఇది తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.