Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

షార్ట్స్‌లో చూడండి
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. నిత్యమూ కిటకిటలాడిపోయే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బోసిపోతోంది. ఈ ఉదయం కేవలం 6 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు స్వామి సర్వ దర్శనానికి వేచి చూస్తున్న పరిస్థితి. వీరికి గరిష్ఠంగా నాలుగు గంటల్లో దర్శనం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. టైమ్ స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు 2 నుంచి మూడు గంటల్లోనే దర్శనం అవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 59,985 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,440 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.22 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ పేర్కొంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News