ఏపీ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలకు పచ్చజెండా

  • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
  • రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశం
  • ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ఓకే
ఆంధ్రప్రదేశ్ లో మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు రాజధాని అమరావతిలో సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.   దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై మంత్రి కన్నబాబు తొలుత మాట్లాడారు.

మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయని, వారం కింద క్వింటాలు ధర రూ.2,200 ఉండగా, ప్రస్తుతం అది రూ.1,500కు పడిపోయిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా కొనుగోళ్లు చేయాలని సూచించారు. సీఎం చేసిన ఈ నిర్ణయాలతో పాటు, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట, వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ప్రారంభించనున్న 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన అంశాలకు కూడా  కేబినెట్ ఆమోదం తెలిపింది.
Go Back to Shorts
AP Cabionet meet
Many decisions came out
Corn farmers
Andhra Pradesh
CM Jagan

More Telugu News