Jagan: నవంబరు 1న అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు

షార్ట్స్‌లో చూడండి
నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు అధికారికంగా నవంబరు 1న అవతరణ వేడుకలు నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఈ వేడుకలను నిర్వహిస్తుండడంతో జగన్ ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథి హాజరవుతారు. ఈ వేడుకల్లో మొదటి రోజు హస్త, చేనేత కళల ప్రదర్శనలు, రెండవ రోజు కూచిపూడి, లలిత, జానపద కళల ప్రదర్శనలు, మూడవ రోజు తెలుగు సంప్రదాయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయి.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh

More Telugu News