Telugudesam: దొందూ దొందే! జగన్, చంద్రబాబుపై ‘జనసేన’ విమర్శలు

  • చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా జగన్ పాలన
  • ఏపీలో అభివృద్ధి  తిరోగమనం
  • టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోంది
ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడులపై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. నాడు చంద్రబాబు పాలనలో, నేడు జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనం పట్టించారని అన్నారు. ‘దొందూ దొందే’ అంటూ జగన్, చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాష్ట్ర గతిని, ప్రగతిని తిరోగమనం పట్టించడంలో చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

మరో ట్వీట్ లో.. టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం పాలవడానికి కారణం, వారి హయాంలో జరిగిన ఇసుక మాఫియానే అని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిందే తప్ప ఇసుక విధానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.  
Telugudesam
Chandrababu
Jagan
Janasena

More Telugu News