మోదీగారూ...దక్షిణాదిలో కళాకారులే లేరా : మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సంచలన ట్వీట్
- సెలబ్రిటీలతో భేటీకి ఒక్కరినీ ఆహ్వానించక పోవడంపై ఆవేదన
- మీ తీరు బాధ కలిగించిందని ట్విట్టర్ ద్వారా వెల్లడి
- సినీ వర్గాల్లో సంచలనం రేపిన ట్వీట్
దీనిపై స్పందించిన ఉపాసన `మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. కళాకారులతో జరిగిన సమావేశాన్ని మీరు మాత్రం కేవలం హిందీ నటీనటులకే పరిమితం చేశారు. దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధగా ఉంది` అంటూ ట్వీట్ చేశారు.
ఇంతవరకు ఏ వివాదంలోనూ కనిపించని ఉపాసన ఏకంగా ప్రధానిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే అని పలువురు నెటిజన్లు ఉపాసనకు మద్దతుగా నిలిచారు.