కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ అరెస్ట్.. తోపులాటలో కిందపడ్డ ఏసీపీ
- ఆర్టీసీ కార్మికులతో కలిసి సమ్మెలో కూర్చున్న బండి సంజయ్
- పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం
- ఉద్రిక్తంగా మారిన వాతావరణం
సంజయ్ ను తీసుకెళ్లకుండా పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుగా పడుకున్నారు. వారిని అడ్డుతొలగించి పోలీసు వాహనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయినా కిలోమీటర్ మేర పరుగులు తీసి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ కార్యకర్తల తోపులాటలో ఏసీపీ అశోక్ కుమార్ కిందపడిపోయారు. కానిస్టేబుళ్లు ఆయనను పైకి లేపారు. అయితే, బండి సంజయ్ మధ్యలో కలగజేసుకుని సర్దిచెప్పడంతో... పరిస్థితి అదుపులోకి వచ్చింది.