విండీస్ కు కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చిన టీమిండియా

వెస్టిండీస్ తో రెండో టెస్టులో భారత్ పూర్తిగా పట్టుబిగించింది. తన రెండో ఇన్నింగ్స్ ను 168/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్ తన ప్రత్యర్థి ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్నుంచింది. నాలుగో రోజు ఉదయం లక్ష్యఛేదన ఆరంభించిన కరీబియన్లు 135 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టారు. క్రీజులో షామార్ బ్రూక్స్ 31 పరుగులతో, జెర్మైన్ బ్లాక్ వుడ్ 28 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ కు 2 వికెట్లు, షమీ, జడేజాకు చెరో వికెట్ దక్కాయి.

ఈ మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, విండీస్ 117 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లకు 168 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తెలుగుతేజం హనుమవిహారి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రహానేతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. రహానే 64 పరుగులు చేయగా, విహారి 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Go Back to Shorts
India
West Indies

More Telugu News