Chandrababu: రేపు వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

  • కృష్ణా నది వరదలతో నీటమునిగిన అనేక ప్రాంతాలు
  • కృష్ణా జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
  • పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న మాజీ సీఎం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా నదికి వరదలు రావడంతో అనేక ప్రాంతాలు నీట మునిగి, వేలమంది ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను టీడీపీ అధినేత పరామర్శించనున్నారు. వరద బాధితులతో మాట్లాడతారు. 
Chandrababu
Krishna District
Floods

More Telugu News