మూడో టీ20 కూడా భారత్దే.. సిరీస్ వైట్వాష్!
- రాణించిన కోహ్లీ..చితక్కొట్టిన రిషభ్ పంత్
- ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా దీపక్ చాహర్
- రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం
వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ 58, రోవ్మన్ పావెల్ 32 పరుగులు చేశారు.
అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. లోకేశ్ రాహుల్ 20, కోహ్లీ 59, రిషభ్ పంత్ 65 పరుగులు చేశారు. అద్భుత స్పెల్తో అదరగొట్టిన దీపక్ చాహర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.