జమ్ముకశ్మీర్ ను రెండుగా చీల్చిన కేంద్ర ప్రభుత్వం!
- జమ్ముకశ్మీర్, లడఖ్ లుగా విడిపోయిన కశ్మీరం
- అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్
- అసెంబ్లీ ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్
జమ్ముకశ్మీర్ కు ఇప్పటివరకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడం గమనార్హం. ముందస్తు పక్కా వ్యూహంతో పార్లమెంటులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు, జమ్ముకశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేశారు.