సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం: కేటీఆర్

  • నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
  • 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం అరుదు
  • వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్టు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు.

నియోజకవర్గాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, నెలలోనే 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం దేశ రాజకీయాల్లోనే అరుదన్నారు. గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో ముందుండటంతో వాటిని అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రూ.15 కోట్లు సభ్యత్వ రుసుం కింద అందినట్టు తెలిపారు.
Go Back to Shorts
KTR
Palla Rajeswar Reddy
TRS
Gajwel
Palakurthi
Telangana Bhavan

More Telugu News