jagan: తన అవినీతి బురదను టీడీపీకి అంటించడమే జగన్ లక్ష్యం: మాజీ మంత్రి నారాయణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. తన అవినీతి బురదను టీడీపీకి అంటించడమే జగన్ లక్ష్యమని చెప్పారు. అర్బన్ హౌసింగ్ లో అవినీతి చోటు చేసుకుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ. 1,546 నుంచి రూ. 1,651 వరకు మాత్రమే చెల్లింపులు జరిగాయని చెప్పారు. చదరపు అడుగుకు రూ. 2,300 వరకు పెంచారనే ప్రచారంలో నిజం లేదని తెలిపారు. 2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ. 5వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.