భారత కంపెనీలకు అమెరికా కఠిన హెచ్చరిక!
- ఇండియా ద్వారా హువావేకు టెక్నాలజీ
- తమ సాంకేతికతను బదిలీ చేయరాదని హెచ్చరిక
- కంపెనీలే చర్యలు చేపట్టాలని సూచన
హువావేతో అమెరికా సర్కారు వాణిజ్య యుద్ధం చేస్తున్న సమయంలో అమెరికన్ టెక్నాలజీ, ఇండియా ద్వారా హువావేకు చేరుతోందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హువావే భారత్ లో నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై ఓ కన్నేసి ఉంచాలని, ఇండియాలో ఆ సంస్థ టెక్నాలజీ ల్యాబ్ లను నిర్వహిస్తుంటే తనఖీలు జరిపి యూఎస్ సాంకేతికత అక్కడ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కన్నా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీలే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.