నారాయణాద్రి, వెంకటాద్రి సహా పలు రైళ్లలో స్లీపర్ బోగీల తగ్గింపు!
- ప్రతి రైలులో ఒక్కో బోగీ తగ్గింపు
- స్లీపర్ బోగీల స్థానంలో ఏసీ బోగీలు
- ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో రైల్వే శాఖ
- అభ్యంతరం చెబుతున్న ప్రయాణికులు
కాగా, నిత్యమూ హైదరాబాద్ నుంచి తిరుపతికి సగటున 9 రైళ్లు నడుస్తుండగా, వాటిల్లో సరాసరి 150 వరకూ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ నిర్ణయంతో మరో 80 మందికి (72 బెర్తులు, 8 ఆర్ఏసీ) బెర్త్ లు కన్ఫార్మ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో సాధారణ ప్రయాణికులు మరింత కష్టపడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్లీపర్ బోగీలో బెర్త్ కు రూ. 370 ఉండగా, ఏసీ బోగీలో అయితే కనీసం రూ. 1000 వరకూ చెల్లించాల్సి వుంటుంది. స్లీపర్ బోగీలు తొలగించి ఏసీ బోగీలు తగిలించడం వల్ల సాధారణ ప్రజలకు లాభం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం అర్ధం లేనిదని, సామాన్యులు వెళ్లే స్లీపర్ బోగీలనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.