ఐఏఎస్ అధికారికి నెల రోజుల జైలుశిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు!
- కరీంనగర్ లో కమిషనర్ గా పనిచేసిన శశాంక్
- భవనాల కూల్చివేతపై హైకోర్టు ఆదేశాలను పాటించని అధికారి
- కోర్టు ధిక్కార నేరం రుజువు కావడంతో శిక్ష
కాగా, కరీంనగర్ లో 1980వ దశకంలో మునిసిపాలిటీ నుంచి అనుమతి తీసుకుని నివాస భవనాలు, షాపులు నిర్మించుకోగా, ఆపై నగర విస్తరణలో భాగంగా, నోటీసులివ్వకుండానే పిటిషనర్ నివాస భవనాన్ని, షాపులను అధికారులు కూల్చివేశారు. దీనిపై గతంలో స్టే ఆదేశాలను ఇచ్చిన హైకోర్టు, ఆపై కేసు విచారించి, పిటిషనర్ కోల్పోయిన 13 షాపులు తిరిగి కేటాయించాలని, లేదా నిబంధనల ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని 2015 జనవరిలో ఆదేశాలిచ్చింది.
కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడంతో, పిటిషనర్ మరోమారు కోర్టును ఆశ్రయించి, ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ అధికారుల తీరుని తప్పుబడుతూ, అప్పటి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్ కు శిక్ష ఖరారు చేశారు.