విజయనగరం, విశాఖలో ఫ్యాను జోరు..దూసుకుపోతున్న బొత్స, పుష్పవాణి!

  • విజయనగరంలోని ఐదు చోట్ల లీడింగ్ 
  • విశాఖలోని మూడు చోట్ల ఆధిక్యం
  • ఇప్పటికే 83 సీట్లలో దూసుకుపోతున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ దూసుకుపోతోంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, నెరిమర్లలో బి.అప్పలనాయుడు, విజయనగరంలో వీరభద్రస్వామి, శృంగవరపు కోట నుంచి కె.శ్రీనివాస్, కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి లీడింగ్ లో కొనసాగుతున్నారు. అలాగే విశాఖపట్నంలోని అరకు, పాయకరావు పేట, యలమంచిలి స్థానాల్లో వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. ఏపీలో తొలిరౌండ్ ముగిసేసరికి వైసీపీ 83, టీడీపీ 17, జనసేన 2 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Visakhapatnam District
Vijayanagaram District
YSRCP
l;eading

More Telugu News