జైలులో మారుతీరావు తమ్ముడి వజ్రపు ఉంగరాలు మాయం!
- బెయిల్పై బయటకు వచ్చిన ప్రధాన నిందితులు
- ఉంగరాలను భద్రపరిచిన నల్లగొండ జైలు అధికారులు
- ఉంగరాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు
అయితే శ్రవణ్ కుమార్ నల్లగొండ జైలులో ఉన్నప్పుడు ఆయన వేళ్లకు ఉన్న డైమండ్ ఉంగరాలను జైలు అధికారులు తీసుకుని భద్రపరిచారు. ప్రస్తుతం అవి మాయమయ్యాయి. ఈ విషయమై జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉంగరాల విలువ సుమారు రూ.6 లక్షలు ఉండొచ్చని శ్రవణ్ కుమార్ తెలియజేస్తున్నారు. అయితే జైలర్ జలంధర్ యాదవ్పై తమకు అనుమానం ఉన్నట్టు జైలు అధికారులు తెలిపారు.