పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల దుర్మరణం
- అదుపుతప్పి చెట్టును ఢీకొన్న వాహనం
- రోడ్డుపై చెల్లాచెదరుగా పడిన ప్రయాణికులు
- గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమం
సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన అందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పదిమంది చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 13 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతుల కుటుంబాలకు కలెక్టర్ లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.