కేటీఆర్, హరీశ్ మధ్య ఆసక్తకర చర్చ... ఎంజాయ్ చేసిన కార్యకర్తలు
- టీఆర్ఎస్లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి
- గతంలో చేసిన సవాల్ను గుర్తు చేసుకున్న కేటీఆర్, హరీశ్
- మెదక్ నుంచే భారీ మెజారిటీ వస్తుందన్న కేటీఆర్
- క్రెడిట్ తనకు ఇవ్వాలన్న హరీశ్
మెదక్ నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందని హరీశ్ పేర్కొనగా, కాదు కరీంనగర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మెదక్లో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో మెదక్ ఎంపీ స్థానం నుంచే అత్యధిక మెజారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, నేడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఆ మెజారిటీలో తనకూ కొంత క్రెడిట్ ఇవ్వాలని హరీశ్ కోరారు. దీంతో అక్కడున్న కార్యకర్తలంతా వీరిద్దరి మధ్య సంభాషణను చూసి బాగా ఎంజాయ్ చేశారు.