Chandrababu: వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు.


Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News