LOC: భారత సరిహద్దుల్లో మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్!

  • పూంచ్, అఖ్నూర్, నౌషెరా సెక్టార్లలో పాక్ కాల్పులు
  • దీటుగా జవాబిచ్చిన భారత సైనికులు
  • 24 గంటల వ్యవధిలో పాక్  నాలుగు సార్లు కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మళ్లీ ఉల్లంఘించింది. భారత సరిహద్దుల్లో మళ్లీ కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్ లోని పూంచ్, అఖ్నూర్, నౌషెరా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. అయితే, ఈ కాల్పులకు భారత జవాన్లు దీటుగా స్పందించారు. ఈ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పాకిస్థాన్ నాలుగు సార్లు కాల్పులకు పాల్పడింది.
LOC
Jammu And Kashmir
Pakistan

More Telugu News